రహదారులకు మరమ్మతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-03T05:38:04+05:30 IST

గోకవరం, డిసెంబరు 2: అడుగడుగునా గోతు లతో ప్రమాదభరితంగా మారిన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకులు బుధవారం ఆందోళన చేశారు. పాతబస్టాండ్‌ సమీపంలో ప్రధాన రహదారిపై భైఠాయించి గంటసేపు ధర్నా నిర్వహించారు. పలు వురు

రహదారులకు మరమ్మతులు చేపట్టాలి
పాత బస్టాండ్‌ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

గోకవరంలో టీడీపీ నాయకుల ధర్నా

గోకవరం, డిసెంబరు 2: అడుగడుగునా గోతులతో ప్రమాదభరితంగా మారిన రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకులు బుధవారం ఆందోళన చేశారు. పాతబస్టాండ్‌ సమీపంలో ప్రధాన రహదారిపై భైఠాయించి గంటసేపు ధర్నా నిర్వహించారు. పలు వురు మట్లాడుతూ మండలంలో రహదారులు అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అనేకమంది వాహనదారులు గాయాలబారిన పడ్డారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా విజయ్‌, పాలూరి బోస్‌, గునుపే భరత్‌, మంగరౌతు రాము, పోసిన ప్రసాద్‌, బత్తుల సత్తిబాబు, ఆచంట రాజు, పాలాడి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:38:04+05:30 IST