సీసీఐలో సాంకేతిక లోపం
ABN , First Publish Date - 2022-06-28T04:57:44+05:30 IST
సీసీఐలో సాంకేతిక లోపం
- కిలాన్ సెక్షన్లో నిలిచిన కింకర్ తయారీ
- రెండు రోజులుగా ఉత్పత్తి బంద్
తాండూరు రూరల్, జూన్ 27 : కరన్కోట్ సమీపంలోని సీసీఐ కర్మాగారంలో సాంకేతిక లోపంతో సిమెంటు తయారీకి ఉపయోగించే ముడి పదార్థం(కింకర్) తయారీ నిలిచిపోయింది. రెండు రోజులుగా ఉత్పత్తి ఆగిపోయింది. కర్మాగారంలో ప్రతిరోజు మూడు వేలటన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతోంది. అయితే రెండు రోజుల క్రిత ం కిలాన్ సెక్షన్లో సిమెంటు తయారయ్యే కింకర్ నిలిచిపోయింది. దీంతో దానిని యాజమాన్యం మరమ్మతులు చేయించే పనుల్లో నిమగ్నమమైంది. అయితే సీసీఐ ఉన్నతాధికారులు మాత్రం హడావిడిగా ఢిల్లీ కార్పొరేట్ ఆఫీ్సకు వెళ్లినట్లు సమాచారం.