మాడ్గులలో వైభవంగా తీజ్ పండుగ
ABN , First Publish Date - 2022-08-11T05:16:17+05:30 IST
మాడ్గులలో వైభవంగా తీజ్ పండుగ
మాడ్గుల, ఆగస్టు 10: మండలంలోని పల్గుతండాలో గిరిజన సంప్రదాయ ఆచారాల ప్రకారం తీజ్పండుగను సర్పంచ్ వసురాం ఆధ్వర్యంలో తండావాసులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ గౌరవరం పద్మ, మాజీ ఎన్బీసీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, తాలుక అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లుగౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేశ్, శ్రీను పాల్గొన్నారు.