వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
ABN , First Publish Date - 2021-10-17T05:03:36+05:30 IST
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
- మామను హతమార్చిన కోడలు
- పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఘటన
పరిగి(రూరల్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత మామను కోడలు హత్య చేసిన ఘటన పరిగి మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగమ్మ భర్త నర్సింహులు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి వృద్ధుడైన తనమామ బోయ కిష్టయ్య (75)తో కలసి ఇంట్లో ఉంటుండేది. భర్త లేక చనిపోవడంతో ఆమె అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వారికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా మామను వదిలించుకోవాలనుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ప్రియుడితో కలసి ఆమె మామ గొంతు నులిమి హత్య చేసింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు మంగమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.