ఇసుక దిబ్బలో యువకుడి శవం లభ్యం
ABN , First Publish Date - 2021-04-23T06:50:04+05:30 IST
మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ ఇసుక దిబ్బల్లో గు రువారం యువకుడి శవం లభ్యమైంది. మృతుడి ఆనవాళ్లు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపో యాయి.
బొమ్మనహాళ్, ఏప్రిల్ 22 : మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ ఇసుక దిబ్బల్లో గు రువారం యువకుడి శవం లభ్యమైంది. మృతుడి ఆనవాళ్లు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపో యాయి. 20 రోజుల క్రితమే హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్థు ల సమాచారం మేరకు... పొలాలకు వెళ్లి వస్తున్న కూలీలు ఇసుక దిబ్బల్లో గుర్తు పట్టలే ని స్థితిలో ఉన్న యువకుడి శవాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇ చ్చారు. మృతుడి వయసు 25 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. శరీరభాగాలన్నీ కుళ్లిపోయాయి. యువకుడు జీన్సప్యాంట్ ధరించగా, జేబులో పాస్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స ల భ్యమయ్యాయి. వీటి ఆధారంగా గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బోయ రాముడుగా గుర్తించారు. కాగా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.