ఈతచెట్లు ధ్యంసం చేసిన వ్యక్తిపై కేసు
ABN , First Publish Date - 2021-05-11T05:25:42+05:30 IST
ఈతచెట్లు ధ్యంసం చేసిన వ్యక్తిపై కేసు
మొయినాబాద్: ఈతచెట్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఈత చెట్లు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బేగరి అంజయ్య ఇటీవల ప్రభుత్వ భూమి చదును చేశారు. ఈ క్రమంలో భూమిలోని ఈత చెట్లను ధ్వంసం చేశాడు, సోమవారం గీత కార్మికులు గమనించి చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎక్సైజ్ పోలీసులు మొత్తం 48 చెట్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు చేవెళ్ల ఎక్సైజ్ సీఐ రాకేష్ తెలిపారు.