పెన్నానదిలో గల్లంతైన యువకుల శవాలు లభ్యం

ABN , First Publish Date - 2021-03-03T06:59:35+05:30 IST

మండలంలోని బోడాయిపల్లి సమీపంలోని పెన్నానదిలో గల్లంతైన యువకుల శవాలు సోమవారం అర్ధరాత్రి లభ్యమయ్యాయి.

పెన్నానదిలో గల్లంతైన యువకుల శవాలు లభ్యం

తాడిపత్రి, మార్చి 2: మండలంలోని బోడాయిపల్లి సమీపంలోని పెన్నానదిలో గల్లంతైన యువకుల శవాలు సోమవారం అర్ధరాత్రి లభ్యమయ్యాయి. ఈతకు వెళ్లిన సర్పంచు కుమారుడు ఉదయ్‌తో పాటు శ్రీధర్‌లు గల్లంతైన విషయం తెలిసిందే. వీరి ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు కలిసి ఆరుగంటల పాటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి శవాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమే్‌షరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2021-03-03T06:59:35+05:30 IST