కాణిపాకంలో నేడు ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-06-23T06:02:26+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పునఃనిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తెలిపారు.
ఐరాల(కాణిపాకం), జూన్ 22: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పునఃనిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తెలిపారు. మంగళవారం ఆలయం వద్ద ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఉదయం 11.08 గంటలకు శుభలగ్నంలో శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు వస్తారన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆలయ ఉభయదారులు, పరిసర గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.