కాణిపాకంలో నేడు ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-06-23T06:02:26+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పునఃనిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు తెలిపారు.

కాణిపాకంలో నేడు ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన
శంకు స్థాపన చేయనున్న ప్రదేశం

ఐరాల(కాణిపాకం), జూన్‌ 22: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పునఃనిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు  తెలిపారు. మంగళవారం ఆలయం వద్ద ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఉదయం 11.08 గంటలకు శుభలగ్నంలో శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు వస్తారన్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆలయ ఉభయదారులు, పరిసర గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:02:26+05:30 IST