గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
ABN , First Publish Date - 2021-02-28T05:25:27+05:30 IST
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.
కొల్చారం, ఫిబ్రవరి 27: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిష్టాపూర్ వద్ద శుక్రవారం రాత్రి కారు, బైకు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా అదేరోజు రాత్రి దేవీలాల్ మృతిచెందిన విషయం విదితమే. కాగా శనివారం తెల్లవారు జామున గోపాల్(28) చికిత్స పొందుతూ మరణించాడు. కాగా బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.