దొంగల మండపాన్ని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2021-01-17T04:26:38+05:30 IST

శిథిలావస్థకు చేరుకున్న దొంగల మండపాన్ని పునరుద్ధరించకుంటే ఒక వారసత్వ కట్టడం ఆనవాళ్లను కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దొంగల మండపాన్ని పునరుద్ధరించాలి
మండపాన్ని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి తదితరులు

ఈమని శివనాగిరెడ్డి


తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థకు చేరుకున్న దొంగల మండపాన్ని పునరుద్ధరించకుంటే ఒక వారసత్వ కట్టడం ఆనవాళ్లను కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్‌ మండలంలోని మంగళం పరిధిలో ఉన్న దొంగల మండపాన్ని శనివారం ఆయన సందర్శించారు. 400 ఏళ్ల క్రితం దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల వసతి కోసం నిర్మించిన 16 స్తంభాల మండపం ఆలనా, పాలనా లేక శిథిలావస్థకు చేరుకుందన్నారు. వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండు చేశారు. స్థానికులకు మండపం చరిత్ర గురించి అవగాహన కల్పించారు. ఆయనతోపాటు ఎస్వీబీసీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ బీవీ రమణ ఉన్నారు.

Updated Date - 2021-01-17T04:26:38+05:30 IST