వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-09T06:08:38+05:30 IST
పట్టణంలోని భంభంస్వామి లేఔట్ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున (50) శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు
రాయదుర్గం రూరల్, మే 8 : పట్టణంలోని భంభంస్వామి లేఔట్ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున (50) శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. సీ ఐ ఈరణ్ణ తెలిపిన వివరాలివి. మల్లికార్జున కళ్యాణదుర్గంలో లైన్మెన్గా పనిచేస్తుండేవాడు. తాగుడుకు బాని స కావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.