దేవాలయాల జీర్ణోద్ధరణ హర్షణీయం

ABN , First Publish Date - 2021-06-23T06:25:58+05:30 IST

మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 సంవత్సరాల చరిత్ర కల్గిన దేవాలయాల జీర్ణోద్ధరణ గావించడం హర్షణీయమని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

దేవాలయాల జీర్ణోద్ధరణ హర్షణీయం


 హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మడకశిరటౌన్‌, జూన్‌ 22: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 సంవత్సరాల చరిత్ర కల్గిన దేవాలయాల జీర్ణోద్ధరణ గావించడం హర్షణీయమని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం మాజీ మంత్రి, ఆలయ కమిటీ చైర్మన్‌ రఘువీరారెడ్డి, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని పంపారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పుణ్యక్షేత్రాల నిర్మాణం, పాత దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం మంచి సంప్రదాయమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో దేవాలయాలు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కారణంగా కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని సందేశంలో పేర్కొన్నారు.


Updated Date - 2021-06-23T06:25:58+05:30 IST