రెండిళ్లలో చోరీ - బంగారం, నగదు అపహరణ
ABN , First Publish Date - 2021-04-18T06:14:14+05:30 IST
పట్టణంలోని రాగితోటపాలెంలో శనివారం తెల్లవారుజామున దుండగులు రెండిళ్లలో చోరీ చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి.
తాడిపత్రిటౌన, ఏప్రిల్17: పట్టణంలోని రాగితోటపాలెంలో శనివారం తెల్లవారుజామున దుండగులు రెండిళ్లలో చోరీ చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి. కాలనీలో నివాసముండే ఓబుళరాజు కుటుంబసభ్యులతో కలిసి రాత్రి ఇంటిపై నిద్రించా డు. తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న ఏడున్నర తులాల బంగారు నగలు, రూ.15వేల నగదు చోరీ చేశారు. అదేవిధంగా అదేవీధికి చెందిన ప్రేమ్కుమార్ కూడా కుటుంబసభ్యులతో కలిసి ఇంటిపై నిద్రిస్తుండగా, తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఆరున్నర తులాల బంగారునగలు, రూ.45వేల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.