లారీ నుంచి 300 లీటర్ల డీజిల్‌ చోరీ

ABN , First Publish Date - 2021-07-27T04:01:16+05:30 IST

మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులోని బంక్‌లో ఆదివారం రాత్రి ఇసుక లారీ నుంచి డీజిల్‌ చోరీ జరిగింది.

లారీ నుంచి 300 లీటర్ల డీజిల్‌ చోరీ

హత్నూర, జూలై 26: మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులోని బంక్‌లో ఆదివారం రాత్రి ఇసుక లారీ నుంచి డీజిల్‌ చోరీ జరిగింది. తహేర్‌ఖాన్‌పేటకు చెందిన రాముయాదవ్‌ కరీంనగర్‌ జిల్లా కాజీపూర్‌ నుంచి ఇసుక లోడ్‌ లారీతో వచ్చి ముచ్చర్ల గ్రామ శివారులోని పెట్రోల్‌ బంక్‌లో నిలిపి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం వచ్చి చూడగా డీజిల్‌ ట్యాంకు తాళం పగులగొట్టి 300 లీటర్ల డీజిల్‌ దొంగిలించినట్లు గుర్తించాడు. బంక్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి డీజిల్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించా రు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు.  

Updated Date - 2021-07-27T04:01:16+05:30 IST