పట్టుపురానికి ఎన్నికలు లేనట్టే!
ABN , First Publish Date - 2021-03-07T05:12:43+05:30 IST
కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీకి ఈసారి ఎన్నికలు లేనట్టే. సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ గత నెల 21తో ముగిసింది. అప్పట్లో కొన్ని వివాదాలు, అభ్యంతరాల కారణంగా నిలిచిన పంచాయతీలకు సంబంధించి ఈ నెల 15న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో కోటబొమ్మాళి మండలం పట్టుపురం, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ స్థానాలతో పాటు 64 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈసీ ఆదేశాల మేరకు వీటికి సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా.. శనివారం సాయంత్రానికి గడువు ముగిసింది. అయితే ఈసారి కూడా పట్టుపురం సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. నువ్వలరేవులో ఒకే ఒక నామినేషన్ నమోదైంది. 64 వార్డులకు సంబంధించి శనివారం 28 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ సారీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు నిల్
వార్డు స్థానాలకు 53 దరఖాస్తులు
నేటి నుంచి పరిశీలన
శ్రీకాకుళం,
ఆంరఽధజ్యోతి, మార్చి 6: కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీకి ఈసారి
ఎన్నికలు లేనట్టే. సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ గత నెల 21తో ముగిసింది. అప్పట్లో కొన్ని
వివాదాలు, అభ్యంతరాల కారణంగా నిలిచిన పంచాయతీలకు సంబంధించి ఈ నెల 15న మళ్లీ
ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో కోటబొమ్మాళి మండలం
పట్టుపురం, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు పంచాయతీలకు సంబంధించి సర్పంచ్
స్థానాలతో పాటు 64 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈసీ ఆదేశాల
మేరకు వీటికి సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించగా..
శనివారం సాయంత్రానికి గడువు ముగిసింది. అయితే ఈసారి కూడా పట్టుపురం
సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. నువ్వలరేవులో ఒకే
ఒక నామినేషన్ నమోదైంది. 64 వార్డులకు సంబంధించి శనివారం 28 నామినేషన్లు
దాఖలయ్యాయి. దీంతో వార్డులకు మూడురోజుల్లో మొత్తం 53 మంది నామినేషన్లు
వేశారు. కొత్తూరులో 3, వీరఘట్టం-3, పాతపట్నం-2, మెళియాపుట్టి -1, పాలకొండ
-1, సారవకోట -1, లావేరు -5, టెక్కలి-1, నందిగాం -8, కంచిలి -2,
వజ్రపుకొత్తూరు -14, కవిటి -2, మందస -4, ఇచ్ఛాపురంలో ఆరు నామినేషన్లు
నమోదయ్యాయి. ఈ నామినేషన్లను అధికారులు ఆదివారం పరిశీలించనున్నారు. ఈ నెల
10వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.
నువ్వలరేవు ‘పంచాయతీ’ సుఖాంతం
వజ్రపుకొత్తూరు,
మార్చి 6: నువ్వలరేవు ‘పంచాయితీ’ సుఖాంతమైంది. శనివారం సర్పంచ్, వార్డు
స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు కావడంతో ఏకగ్రీవం లాంఛనమే. గత
నెల 13న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. గ్రామస్థులంతా
ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్
దాఖలు చేయలేదు. అప్పట్లో ఒక వ్యక్తి చివరి నిమిషంలో దాఖలు చేసినా.. అది
చెల్లుబాటు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతంలో వివిధ
కారణాలతో వాయిదా పడిన పంచాయతీలకు, వార్డులకు ఇటీవల మరోసారి ఎన్నికల కమిషన్
నోటిఫికేషన్ జారీచేసింది. 4, 5, 6 తేదీల్లో నామినేషన్లకు సమయమిచ్చింది.
అయితే తొలి రెండు రోజులు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మరోసారి ఇక్కడ
ఎన్నికలు వాయిదా పడతాయన్న అనుమానం అందరినీ వెంటాడింది. కానీ శనివారం
సర్పంచ్తో పాటు వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలైనట్టు ఎంపీడీవో
ఈశ్వరమ్మ తెలిపారు.