టిక్‌టాక్‌ లవ్‌స్టోరీ

ABN , First Publish Date - 2022-09-23T06:52:25+05:30 IST

బిగ్‌బాస్‌ రియాల్టీ షోను మరిపించే లవ్‌స్టోరీకి టిక్‌టాక్‌ వేదికైంది. ఒకే యువకుడు టిక్‌టాక్‌లో పరిచయమైన ఇద్దర్ని పెళ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

టిక్‌టాక్‌ లవ్‌స్టోరీ
డక్కిలిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో తన భర్తకు మరో యువతితో పెళ్లి జరిపిస్తున్న భార్య

డక్కిలి, సెప్టెంబరు 22 : బిగ్‌బాస్‌ రియాల్టీ షోను మరిపించే లవ్‌స్టోరీకి టిక్‌టాక్‌ వేదికైంది. ఒకే యువకుడు టిక్‌టాక్‌లో పరిచయమైన ఇద్దర్ని పెళ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. డక్కిలిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో బుధవారం రాత్రి జరిగిన పెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించింది. డక్కిలి మండలం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కళ్యాణ్‌ డిగ్రీవరకు చదివాడు. టిక్‌ టాక్‌లో ఉత్సాహంగా పోస్టులు పెడుతుంటాడు. ఆయనకు బోలెడు మంది ఫాలోయర్లున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణానికి చెందిన నిత్య అనే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఏ కారణం చేతో బ్రేక్‌ అయింది.  ఆ తర్వాత టిక్‌ టాక్‌లోనే కడపకు చెందిన మరో యువతి పరిచయమై ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.వీరి కాపురం సాగుతుండగా కళ్యాణ్‌ని వెతుక్కుంటూ విశాఖకు చెందిన నిత్య డక్కిలికి వచ్చింది. అతను లేకుండా జీవించలేనని తేల్చి చెప్పింది. భార్యాభర్తలు, కుటుంబసభ్యులు నచ్చజెప్పినా ఆమె మారలేదు. కళ్యాణ్‌ మీద ఆమె ప్రేమ, పట్టుదలను చూసిన భార్య చివరికి నిత్యతో పెళ్లికి తన భర్తను ఒప్పించింది. బుధవారం రాత్రి నిత్యను అలంకరించి డక్కిలిలోని వెంకటేశ్వరస్వామి గుడిలో పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఇక ముందు ముగ్గురూ కలిసే జీవించాలని నిర్ణయించుకోవడం విశేషం. 

Updated Date - 2022-09-23T06:52:25+05:30 IST