Tirupathi: పాదయాత్రగా కోర్టుకు బయలుదేరిన Mohanbabu, ఇద్దరు కుమారులు

ABN , First Publish Date - 2022-06-28T16:41:45+05:30 IST

మోహన్ బాబు తన కుమారులతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరవుతున్నారు.

Tirupathi: పాదయాత్రగా కోర్టుకు బయలుదేరిన Mohanbabu, ఇద్దరు కుమారులు

తిరుపతి (Tirupathi): సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు (Mohanbabu) తన కుమారులతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరవుతున్నారు. నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మోహన్‌బాబు, విష్ణు (Vishnu), మనోజ్‌ (Manoj)లు పాదయాత్రగా కోర్టు (Court)కు బయలుదేరారు. 2019 మార్చి 22న తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ఫీజ్ రియంబర్స్ చెల్లించలేదని తమ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ధర్నా చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఏ1 నుంచి ఏ5 వరకు నేరానికి పాల్పడ్డారంటూ చార్జిషీటులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా మంగళవారం తిరుపతిలోని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందుకు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు హాజరుకానున్నారు.


టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని 2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌, విద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అప్పటి చంద్రగిరి ఎంపీడీవో, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం అధికారి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌కుమార్‌, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీసుల అనుమతి లేదని, 341, 171(ఎఫ్‌), పోలీస్‌ యాక్ట్‌ 290 కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-06-28T16:41:45+05:30 IST