తిరుపతిలో సీపీఐ కార్యకర్తల ధర్నా
ABN , First Publish Date - 2020-10-26T17:52:50+05:30 IST
చిత్తూరు జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ ఆపీసు ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
తిరుపతి: చిత్తూరు జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ ఆపీసు ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ న్యాయ వివాదాలు లేని భూములలో పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కుంటి సాకుల పేరుతో ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. నవంబర్ 16 లోపల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని.. లేని పక్షంలో లబ్ధిదారులతో తామే గృహప్రవేశం నిర్వహిస్తామని రామానాయుడు హెచ్చరించారు.