APలో మరో ఒమైక్రాన్ కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-12T18:00:43+05:30 IST

రాష్ట్రంలో ఒక్కరోజులో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

APలో మరో ఒమైక్రాన్ కేసు నమోదు

తిరుపతి: రాష్ట్రంలో ఒక్కరోజే రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన విజయనగరం వాసికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అవగా...తిరుపతిలో మరో వ్యక్తికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. యూకే నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి ఒమైక్రాన్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 34 సంవత్సరాల ఎన్‌ఆర్‌ఐ ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈనెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చారు.  ఈరోజు ఆయనకు జీనమ్ టెస్ట్ చేయగా ఒమైక్రాన్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 

Updated Date - 2021-12-12T18:00:43+05:30 IST