రేపు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-12-04T05:08:08+05:30 IST
ట్రిపుల్ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్) ప్రవేశాల కోసం ఈ నెల 5న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 3: ట్రిపుల్ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్) ప్రవేశాల కోసం ఈ నెల 5న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 60 కేంద్రాలను సిద్ధం చేశాం. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తాం. మొత్తంగా 6,785 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గత నెల 28న తీసుకున్న హాల్టిక్కెట్లతోనే హాజరు కావాలి’ అని ఆమె సూచించారు.