పర్యాటక ప్రాంతాల్లో చెత్తను తొలగించాలి

ABN , First Publish Date - 2021-07-27T05:48:15+05:30 IST

: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

పర్యాటక ప్రాంతాల్లో చెత్తను తొలగించాలి

రంపచోడవరం, జూలై 26: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో సబ్‌ కలెక్టరు కట్టా సింహాచలంతో కలిసి  వివిధ శాఖల అధికారులతో  కన్వర్జెన్సీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాం తానికి పర్యాటకుల తాకిడి పెరగనున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామాల్లో ఫైబర్‌నెట్‌ సౌకర్యం, సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తామ న్నారు. సబ్‌ కలెక్టరు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. 

Updated Date - 2021-07-27T05:48:15+05:30 IST