వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-03-01T06:32:50+05:30 IST

తమ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కే విద్యుత కట్‌ చేస్తా వా అంటూ వైసీపీ నేతలు ఏకంగా ట్రాన్సకో కార్యాలయానికే వెళ్లి.. అందులోని ఉద్యోగిపై దాడి చేశారు.

వైసీపీ నాయకుల దౌర్జన్యం

ట్రాన్సకో కార్యాలయంలోనే ఉద్యోగిపై దాడి  

బెళుగుప్ప, ఫిబ్రవరి 28 : తమ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కే విద్యుత కట్‌ చేస్తా వా అంటూ   వైసీపీ నేతలు ఏకంగా ట్రాన్సకో కార్యాలయానికే వెళ్లి.. అందులోని ఉద్యోగిపై దాడి చేశారు. వివరాలు.. బెళుగుప్ప తండాకు తాగునీటి సరఫరా చేసే మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత మీటరు లేదు. మీటర్‌ ఏర్పాటు చేసుకోవాలని ట్రాన్సకో అధికారులు రెండు రోజుల క్రితమే సూచించారు. ఏర్పాటు చేసుకోకపోవడంతో పోల్‌ టూ పోల్‌ విధులు నిర్వహించే ఆషావలి ఆదివారం ఆ ప్లాంట్‌కు విద్యుత కట్‌ చేసి.. వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు నరసింహారెడ్డి , టిప్పునాయక్‌ విద్యుత శాఖ కార్యాలయంలోకి వెళ్లి.. ఆషావలిపై చొక్కా చిరిగేలా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఏఈ సలీం దీనిపై ఎస్‌ఐ హనూర్‌బాషాకు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2021-03-01T06:32:50+05:30 IST