ట్రాన్స్కో.. జర దేఖో
ABN , First Publish Date - 2022-05-23T05:48:49+05:30 IST
ట్రాన్స్కో.. జర దేఖో
కేశంపేట, మే 22: మండలంలోని కేశంపేట-కొండారెడ్డిపల్లి మార్గంలో ప్రమాదవశాత్తు కారు బలంగా ఢీకొట్టడంతో హైటెన్షన్ విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదు. కేశంపేట నుంచి కొండారెడ్డిపల్లి విద్యుత్ సబ్స్టేషన్ను కలిపి హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉంది. నాలుగు రోజుల క్రితం కేశంపేట శివారులో విద్యుత్స్తంభాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో విద్యుత్స్తంభం విరిగిపోయింది. హైటెన్షన్ విద్యుత్లైన్ కావడంతో సమీపంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా విద్యుత్స్తంభాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.