అవమాన భారంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-06-23T06:14:08+05:30 IST
దొం గతనం మోపారన్న అవమాన భా రంతో మండలంలోని కొజ్జేపల్లికి చెందిన శేఖర్, సదానంద మంగ ళవారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డారు.
గుత్తిరూరల్, జూన 22: దొం గతనం మోపారన్న అవమాన భా రంతో మండలంలోని కొజ్జేపల్లికి చెందిన శేఖర్, సదానంద మంగ ళవారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివ రాలివి. గ్రామానికి చెందిన రా మాంజినేయులు భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆదివారం రాత్రి రామాంజినేయులుతో పాటు శేఖర్, సదానంద ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం పుట్టింటి నుంచి రామాంజనేయులు భార్య తిరిగి ఇంటికి చేరుకుంది. బీరువాలోని ఆరు తులాల బంగారం, రూ.20 వేల నగదు కనబడకపోవంతో భర్తను నిలదీసింది. మందు పార్టీ విషయం ఆమెకు చెబుతూ, మత్తు లో తనకేమీ తెలియలేదన్నాడు. శేఖర్, సదానంద తన ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారని భార్య లక్ష్మిదేవి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై అకారణంగా దొంగతనం మోపారనే అవమానం భరించలేక సదానంద, శేఖర్ గ్రామ శివారులో విష ద్రావకం తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు గమనించి గుత్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.