సింగిల్విండోకు రూ.2కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2021-01-24T05:13:14+05:30 IST
సింగిల్విండోకు రూ.2కోట్లు మంజూరు
ఆమనగల్లు : మల్టీ సర్వీసెస్ సెంటర్ స్కీమ్ కింద టీఏఎ్ససీఏబీ ద్వారా ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రూ.2కోట్లు మంజూరైనట్లు సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్ తెలిపారు. నిధుల ద్వారా గోదాముల నిర్మాణం, దుకాణ సముదాయం, పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వ్యయంతో గోదాం నిర్మాణానికి స్థలం కేటాయించాలని శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, కార్యదర్శి హరీశ్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివా్సరెడ్డిలకు రైతులతో కలిసి వెంకటేశ్ వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి రామకృష్ణ, సేవ్యనాయక్, జహంగీర్అలీ, అశోక్, మహేశ్, భిక్షపతి, రాములు, వెంకట్రెడ్డి, పాండు, గణేశ్, లాయక్అలీ, వెంకటయ్య పాల్గొన్నారు.