టీఆర్ఎస్, కాంగ్రెస్పై నిరుద్యోగుల అసంతృప్తి : బీజేపీ
ABN , First Publish Date - 2021-03-01T04:20:20+05:30 IST
టీఆర్ఎస్, కాంగ్రెస్పై నిరుద్యోగుల అసంతృప్తి : బీజేపీ
కులకచర్ల: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరుణం ప్రహ్లాద్రావు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్హాలులో ఆదివారం జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో మాదిరిగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి రాంచందర్రావును గెలిపించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి పట్టభద్రులు ఓటేసేలా ప్రచారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకటయ్యగౌడ్, పరిగి నియోజకవర్గ ఇన్చార్జి కేశవులు, మండల అధ్యక్షుడు మైపాల్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు టీఆర్ఎస్ అన్యాయం
మేడ్చల్: టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అన్నారు. బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షుడు విక్రంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 25మందికి ఒకరి చొప్పున బాధ్యతను తీసుకొని రాంచందర్రావును ఎన్నుకోవాలని అన్నరు. సమావేశంలో పెద్ది మోహన్రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్రెడ్డి, గాంధీయాదవ్, వినోద్, అర్జున్, వంశీ, నాగసాయి, వంశీధర్రెడ్డి పాల్గొన్నారు.