గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-17T06:20:00+05:30 IST

నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో గు ర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందా డు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి
వ్యక్తి మృతదేహం

అనంతపురం క్రైం, జూన 16 : నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో గు ర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందా డు. టూటౌన పోలీసులు తెలిపిన మేరకు... ముప్ఫై ఏళ్లు వ యస్సు కలిగిన ఓ వ్యక్తి ఆనారోగ్య సమస్యతో బుధవారం ప్రభుత్వాసుపత్రి అత్యవ సర చికిత్స విభాగానికి వచ్చాడు. వచ్చిన పది నిమిషాలలోనే స్పృహ లేకుండా పడిపోయా డు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు. అతడి వెంట ఎవరూ రాకపోవడం, అతడి వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా టూటౌన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  మృతుడికి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధా రాలతో టూటౌనపోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. 


Updated Date - 2021-06-17T06:20:00+05:30 IST