ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-05-11T04:52:22+05:30 IST
ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యావిహార్ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సోమవారం పరిశీలించారు. కొవిడ్ బారిన పడి ఇళ్లల్లో సౌకర్యాలు లేని వారు ఇక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కేంద్రాన్ని పరిశీలించిన కిషన్రెడ్డి కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, భోజన వసతి, తదితర వివరాలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.