ఐదుగురికి కరోనా నిర్ధారణ

ABN , First Publish Date - 2021-04-22T06:15:57+05:30 IST

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను కొవిడ్‌ ప్రభావంతో రద్దు చేసినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. బుధవారం మరొక వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య ఐదుగురికి చేరింది.

ఐదుగురికి కరోనా నిర్ధారణ
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేయడంతో శానిటైజేషన్‌ చేపడుతున్న దృశ్యం

  • ఐదు రోజులు ఆలయం మూసివేతకు ఆదేశాలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 21: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను కొవిడ్‌ ప్రభావంతో రద్దు చేసినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. బుధవారం మరొక వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య ఐదుగురికి చేరింది. మరికొంతమంది సిబ్బంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. బుధవారం నుంచి ఆదివారం వరకు ఆలయాన్ని మూసివేసి అర్చకులు మాత్రమే కైంకర్యాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. శుక్రవారం నాడు కల్యాణాన్ని ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయించారు. భక్తులెవరూ రాకుండా లొల్ల, వాడపల్లి సరిహద్దులతో పాటు ఆలయ ప్రాంగణం బయట బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-22T06:15:57+05:30 IST