5న రాష్ట్ర బంద్కు జేఏసీ మద్దతు
ABN , First Publish Date - 2021-03-01T05:58:36+05:30 IST
భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 28: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఈ నెల 5న నిర్వహించే బంద్కు కాకినాడ డివిజన్ ప్రజా సంఘాల జేఏసీ మద్దతు తెలిపిందని కన్వీనర్ అయితాబత్తుల రామేశ్వరరావు తెలిపారు. జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఆ
భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 28: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఈ నెల 5న నిర్వహించే బంద్కు కాకినాడ డివిజన్ ప్రజా సంఘాల జేఏసీ మద్దతు తెలిపిందని కన్వీనర్ అయితాబత్తుల రామేశ్వరరావు తెలిపారు. జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఆదివారం రామేశ్వరరావు నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. దేశ సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో గుడాల కృష్ణ, గదుల సాయిబాబ, హసన్షరీ్ఫ, ఫణీశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు.