విద్యార్థులకు వాంతులు, విరేచనాలు
ABN , First Publish Date - 2022-06-28T03:08:16+05:30 IST
సిద్దిపేట : సిద్దిపేట ఇస్లామీయ కాలేజ్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
సిద్దిపేట : సిద్దిపేట ఇస్లామీయ కాలేజ్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికెన్ కర్రీలో వంకాయలు వేసి వండడం వల్ల కొంతమంది పిల్లలకు అది పడక వాంతులు-విరేచనాలు అయ్యాయి. కాగా ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.