నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

ABN , First Publish Date - 2021-05-10T05:38:04+05:30 IST

ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రధాన పైపులైన్‌ లీకేజీ కారణంగా పలుకాలనీలకు నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

నారాయణఖేడ్‌, మే 9:  ఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రధాన పైపులైన్‌ లీకేజీ కారణంగా పలుకాలనీలకు నాలుగు రోజులుగా తాగునీటి  సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీలవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం మున్సిపాలిటీకి చెందిన నీటి సరఫరా విభాగం సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు  చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు పనులు పూర్తి చేయించి, సోమవారం నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌ తెలిపారు. 


 


Updated Date - 2021-05-10T05:38:04+05:30 IST