మండు వేసవిలో నీటి సవ్వడి
ABN , First Publish Date - 2022-05-18T03:55:30+05:30 IST
మండు వేసవిలో నీటి సవ్వడి
- మంచన్పల్లి చెక్డ్యాంలో పుష్కలంగా నీటి నిల్వ
తాండూరు, మే 17: మండల పరిధి మంచన్పల్లిలో ఏడాది క్రితం రూ.3.5 కోట్ల తో నిర్మించిన చెక్ డ్యాం వేసవిలోనూ నీటితో కళకళలాడుతోంది. ఈ నీటితో చుట్టూ ఉన్న సాగు భూముల బోర్లలో నీరుంది. పశువుల కు తాగునీటి కొరతా తీరింది. చెక్డ్యాం కట్ట ని సమయంలో వర్షపు నీరు వృథాగా పోయి ఇక్కడ చుక్క నీరుండేది కాదు. చెక్ డ్యాం నిర్మాణంతో నీటికి నిలకడ వచ్చింది. నిల్వ నీటితో ప్రజలకు మేలు చేకూరుతోంది.