కిర్బి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2021-03-01T05:14:30+05:30 IST

కిర్బి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

కిర్బి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం, ఫిబ్రవరి 28 : కిర్బి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కిర్బి పరిశ్రమ టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశాన్ని పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కిర్బి పరిశ్రమతో తనకు చిరకాలంగా సంబంధాలున్నాయన్నారు. కార్మికుల సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి టీఆర్‌ఎస్‌ విభాగం కార్మిక సంఘగుర్తింపు ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. తమకు అవకాశం కల్పిస్తే మెరుగైన వేతన ఒప్పందాన్ని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.యాదగిరియాదవ్‌, కార్పొరేటర్‌ పుష్పనగేష్‌, మాజీ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, పరమే్‌షయాదవ్‌, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మయూరినగర్‌ కాలనీలో ఆదివారం జరిగిన మల్లన్న జాతరలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ పుష్పనగేష్‌, మాజీ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదర్శరెడ్డి, మోహన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

టైలర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం

పటాన్‌చెరు, ఫిబ్రవరి 28 : రెడీమేడ్‌ దుస్తుల ప్రపంచంలో ఉపాధి కోల్పోతున్న టైలర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రపంచ టైలర్స్‌ డే సందర్భంగా ఆదివారం ఇంద్రేశంలో టైలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 

Updated Date - 2021-03-01T05:14:30+05:30 IST