పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి స్వాగతం

ABN , First Publish Date - 2022-01-26T04:26:14+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి స్వాగతం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి స్వాగతం
జయక్రిష్ణ జన్మదిన వేడుకలో పాల్గొన్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

బొంరాస్‌పేట్‌, జనవరి 25: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కోస్గి పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డికి మండల పరిధిలోని తుంకిమెట్లలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాలతో ఆయనను సన్మానించారు. అదే విధంగా పార్టీ నాయకుడు జయక్రిష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, అంజిల్‌రెడ్డి, వెంకట్రాములుగౌడ్‌, దేశ్యానాయక్‌, రాజేశ్‌రెడ్డి, నర్సిములునాయుడు, భీమయ్యగౌడ్‌, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:26:14+05:30 IST