చెరువులో స్నానానికి వెళ్లి ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-03T05:46:15+05:30 IST
చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు.
హవేళిఘణాపూర్, డిసెంబరు 2: చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూరుగుపల్లిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు.. బూరుగుపల్లి గ్రామానికి చెందిన శెట్టి లక్ష్మణ్(42) అయ్యప్ప మాలను ధరించాడు. గ్రామాంలోని ఆలయం వద్ద ఉంటూ పూజలు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఆలయం సమీపంలోని చెరువులో స్నానానికి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడతో తోటి అయ్యప్ప స్వాములు కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామస్థుల సహకారంతో చెరువులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం నీటిపై మృతదేహం తేలడంతో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.