వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం
ABN , First Publish Date - 2022-05-26T05:18:07+05:30 IST
వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం
ధారూరు, మే 25 : పూరిగుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకుని గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని కొండాపూర్కలాన్ గ్రామంలో బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడగజంగం ఉషనమ్మ పూరి గుడిసెలో వంట చేసుకుంటుండగా గాలికి పొయ్యిలోని మంటలు పూరి గుడిసెకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న రూ.50 వేల నగదు, నిత్యావసర వస్తువులు, దుస్తులు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్ కార్డు ఇతర వస్తువులు కాలిపోయినట్లు బాధితురాలు ఉషనమ్మ తెలిపింది. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ పరమేశ్, కేవీపీఎస్ నాయకుడు లాలయ్యలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.