మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-24T05:13:19+05:30 IST
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
దౌల్తాబాద్, జనవరి 23 : మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దౌల్తాబాద్ ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని బాలంపేట్ గ్రామానికి చెందిన హరిజన్ యాదమ్మ(37) ఇంట్లో భర్త మల్లప్పతో చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైంది. దీంతో ఆదివారం గ్రామ సమీప చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త చెరువు దగ్గరికివెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.