అధికారపార్టీదంతా మోసం

ABN , First Publish Date - 2021-07-27T06:26:55+05:30 IST

ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీసీ ఎన్నికల హామీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు.

అధికారపార్టీదంతా మోసం

టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట, జూలై 26: ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీసీ ఎన్నికల హామీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. పింఛను రూ.3వేలు చేస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.  టీడీపీ రాయవరం మండల శాఖ సమావేశం అధ్యక్షుడు కొప్పిరెడ్డి మాధవరావు అధ్యక్షతన సోమవారం మండపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ అమలాపురం పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, రాయవరం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్రి వెంకటకృష్ణారెడ్డి, కాదా ప్రభాకరరావు, గ్రామ కమిటీల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-27T06:26:55+05:30 IST