రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-27T06:42:06+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తిరుపతిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మృతిచెందిన రాజస్తాన్‌ యువకుడు జాజారామ్‌.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో


తిరుపతి(నేరవిభాగం), జూలై 26: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు  మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తిరుపతిలో చోటుచేసుకుంది. అలిపిరి ఎస్‌ఐ పరమేష్‌నాయక్‌ తెలిపిన వివరాల మేరకు... రాజస్థాన్‌కు చెందిన ఓంప్రకాష్‌ తిరుపతిలో ఇంటీరియల్‌ డెకరేషన్‌ వర్క్‌ చేస్తున్నాడు. ఇందుకోసం రాజస్థాన్‌ నుంచి కొందరు యువకులను నగరానికి తీసుకు వచ్చాడు. తిరుపతికి వచ్చిన జాజారామ్‌ కొరమేనుగుంట రోడ్డు సమీపంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ప్రస్తుతం రేణిగుంటలోని ఓ భవనంలో జాజారామ్‌ ఇంటిరీయర్‌ వర్క్‌ చేస్తున్నాడు. సోమవారం రాత్రి పని పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై జాజారామ్‌ తిరుపతికి బయలు దేరాడు. కొరమేనుగుంట రోడ్డు వద్ద ద్విచక్రవాహనంలో రోడ్డు దాటు తుండగా రాత్రి 11 గంటల సమయంలో తిరుపతి నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న ఆటో జాజారామ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో జాజారామ్‌ తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడినట్టు తెలిపిన ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-27T06:42:06+05:30 IST