Share News

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:33 AM

Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..
Alluri Sitarama Raju District

Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి? పోలీసులు(AP Police) ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం.

పెదబయలు మండలం కేంద్రంలో హేమరాజు అనే వ్యక్తిని నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. పాడేరు మండలం వర్తనపల్లి గ్రామానికి చెందిన హేమరాజు.. పెదబయలులో వివాహం ఉండగా వెళ్లాడు. రాత్రి అక్కడ మేడపై నిద్రపోయాడు. అయితే, తెల్లారి లేచి చూసే సరికి హేమరాజు రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. వెంటనే హేమరాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.


వివాహేతర సంబంధమే కారణమా..?

అయితే, హేమరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని తెలుస్తోంది. హేమరాజుకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, హేమరాజుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. అతని భార్య కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే తన భర్తను దుండగులు హత్య చేశారని మృతుడి భార్య ఆరోపించింది. ఈమె ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యా్ప్తు చేస్తున్నారు.


ఇవికూడా చదవండి:

అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్!

పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 28 , 2024 | 11:33 AM