Share News

Hyderabad: కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. కిరాతకంగా గొంతుకోసి, బండరాయితో మోది..

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:35 AM

స్నేహితులతో కలిసి కన్న తల్లిని కడతేర్చిన కొడుకు ఉదంతం దుండిగల్‌ పోలీస్‏స్టేషన్‌(Dundigal Police Station) పరిధిలోని సతీష్‌ సొసైటీలో జరిగింది. ఇటీవల లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

Hyderabad: కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. కిరాతకంగా గొంతుకోసి, బండరాయితో మోది..

- స్నేహితులతో కలిసి ఘాతుకం

- పోలీసుల అదుపులో నిందితులు

హైదరాబాద్: స్నేహితులతో కలిసి కన్న తల్లిని కడతేర్చిన కొడుకు ఉదంతం దుండిగల్‌ పోలీస్‏స్టేషన్‌(Dundigal Police Station) పరిధిలోని సతీష్‌ సొసైటీలో జరిగింది. ఇటీవల లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళను ఆమె కుమారుడే హత్యచేసినట్లు తేల్చారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా, ఎర్రకుంటతండాకు చెందిన సక్కుబాయ్‌ (44) భర్త ఆరు నెలల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె తన కుమారుడు శేఖర్‌(22)తో కలిసి గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఉంటున్నది. ఈమె అడ్డాకూలిగా పనిచేస్తూ, జీవనం సాగిస్తున్నది. ఈనెల 20న సతీష్‌ సొసైటీలోని ఖాళీ ప్రదేశంలో సక్కుబాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు శేఖర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హాస్టల్‌ సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ఈనెల 20న సక్కుబాయికి బిర్యానీ తినిపిస్తానని తీసుకెళ్లిన ఆమె కుమారుడు శేఖర్‌, మరో ఇద్దరు వ్యక్తుల సహకారంతో హత్యచేశాడు. ముగ్గురు కలిసి సక్కుబాయి గొంతుకోసి, బండరాయితో మోది హత్యచేసి, ఆ తర్వాత నీటి గుంతలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తన తండ్రి మృతిచెందినప్పటి నుంచి తల్లి ప్రవర్తన సరిగా లేదని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోనందుకే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో శేఖర్‌ చెప్పినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

Read More Crime News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 08:35 AM