ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు.. ఫోటోలు..

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:30 PM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం ఉదయం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. గతేడాది కంటే ఈ ఏడు 14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4 లక్షల 50 వేల 304 మంది.. వీరిలో ఉత్తీర్ణులు అయిన వారు 4 లక్షల 15 వేల 743 మంది(92.32శాతం), తెలుగు మీడియంలో రాసిన విద్యార్దులు 1లక్ష 61 వేల 881 మంది.. వీరిలో ఉత్తీర్ణులు అయిన వారు 1లక్షల 15 వేల 060 మంది(71.08శాతం).

Updated at - Apr 22 , 2024 | 12:30 PM