BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

ABN, Publish Date - Apr 17 , 2024 | 10:07 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే జంప్‌ కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎవనికి బీ-టీమో ఆలోచించుకోవాలి’’ అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు.

BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ 1/5

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్..

BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ 2/5

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటుకూరు మండలం సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.

BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ 3/5

మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం. ప్రక్కన ఎమ్మెల్యే హరీష్ రావును చూడవచ్చు.

BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ 4/5

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటుకూరు మండలంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికపై కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు ఆశీనులైన దృశ్యం.

BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ 5/5

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు..

Updated at - Apr 17 , 2024 | 10:07 AM