BRS: సంగారెడ్డి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
ABN, Publish Date - Apr 17 , 2024 | 10:07 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా, సుల్తాన్పూర్ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జంప్ కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎవనికి బీ-టీమో ఆలోచించుకోవాలి’’ అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు.
Updated at - Apr 17 , 2024 | 10:07 AM