Home » TOP NEWS
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ లోక్సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్వాదీ పార్టీ నేత మారియా ఆలం ఖాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. మతం పేరుతో ఆమె ఓట్ల అడగడంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
కాంగ్రెస్ను 'మునిగిపోతున్న నౌక' తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'డీప్ ఫేక్' వీడియోలపై విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలను విపక్షాలు సర్క్యులేట్ చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్ల లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ సాధించి తీరుతుందని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం తాత్కాలిక అధ్యక్షుడుగా దేవేంద్ర యాదవ్ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్ ఏఐసీసీ ఇన్చార్జి కూడా ఆయన కొనసాగుతారని పేర్కొంది.
అక్రమ మైనింగ్తో ఏపీ, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేశారన్న ఆరోపణలతో 14 ఏళ్లుగా మైనింగ్ జరుపుకుండా నిలుపుదల చేశారని ఓబులాపురం మైనింగ్ కంపెనీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర పర్యావరణ కమిటి పరిశీలన జరిపి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందని న్యాయవాదులు తెలిపారు.