Share News

Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:12 AM

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి(B.Tech student) దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి(B.Tech student) దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ హన్మకొండ(Warangal Hanmakonda)కు చెందిన అడ్వకేట్‌ అన్నమనేని అనిల్‌ కుమారుడు అన్నమనేని మేఘమ్స్‌(24) బహదూర్‌పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో బీ టెక్‌ సెకండ్‌ ఇయర్‌. మేఘమ్స్‌ కారు(టీఎస్11ఈకె9744)ను తీసుకొని స్నేహితుల వద్దకు ఆదివారం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కారును స్నేహితుడు సాయిమానస్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. మేఘమ్స్‌, అర్ణవ్‌, చరణ్‌రెడ్డిలు కలిసి దుండిగల్‌కు బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న కారు నాగులూరు సుందర చైతన్య ఆశ్రమానికి వెళ్లే దారిలో ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జుయింది. మేఘమ్స్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిమానస్‌, అర్ణవ్‌, చరణ్‌రెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో అర్ణవ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అన్నమనేని అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: MLC Kavitha: కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

city3.2.jpg

ఇదికూడా చదవండి: Hyderabad: నగరంలో భానుడి భగ.. భగలు.. మూసాపేట బాలాజీనగర్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

Updated Date - Apr 16 , 2024 | 01:59 PM