Share News

MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:08 PM

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు, వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh)పై అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

- శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో..

హైదరాబాద్‌ సిటీ: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు, వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh)పై అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శోభాయాత్ర మంగళ్‌హాట్‌ నుంచి బయలుదేరి గౌలిగూడ సెంట్రల్‌ గురుద్వారా వద్దకు చేరుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన అనుచరులు జోగీందర్‌ సింగ్‌ బిట్టూ(Joginder Singh Bittoo) తదితరులతో కలిసి యాత్రను నిలిపివేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: చలో.. అరుణాచలం.. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ

అంతేకాకుండా టపాసులు కాల్చడంతోపాటు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నికల గురించి వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు భక్తులకు అసౌకర్యం కలిగించినందుకు అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.

ఇదికూడా చదవండి: TS Politics: బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?

Updated Date - Apr 19 , 2024 | 01:08 PM