Share News

AP Election 2024:మరో కుట్రకు తెరదీసిన వైసీపీ

ABN , Publish Date - May 06 , 2024 | 08:08 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.

AP Election 2024:మరో కుట్రకు తెరదీసిన వైసీపీ
YSRCP

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పడో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి స్కీనింగ్ కమిటీ ప్రతిపాదనలు పంపించింది.


Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

ఎప్పడో జరిగిన నష్టానికి ఎన్నికలకు వారం రోజులు మందు ఇవ్వడం ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు అయిపోయాక ఆ నష్ట పరిహారం ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా ప్రస్తుతం నిలిపి వేయాలని ఈసీ ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేటివరకూ తల్లులు ఖాతాలో జగన్ సర్కార్ వేయని విషయం తెలిసిందే. ఉద్యోగుల జీతాలనే ఇవ్వని సర్కార్ ఇప్పుడు కొత్తగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో కొత్తడ్రామా మొదలు పెట్టింది.


Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెనుకుండి ఈ తతంగమంతా నడిపారు. ఈ రెండింటినీ కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడంతో బ్లూమీడియాకు ఏదో జరిగిపోతున్నట్లుగా లీకులు ఇచ్చారు. ఏడు నెలల క్రితం వచ్చిన తుఫానుకు ఇప్పడు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏంటని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులని అధికార వైసీపీ కలరింగ్ ఇచ్చింది. స్కీనింగ్ కమిటీకి చైర్మన్‌గా సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రైతులు, విద్యార్థులకు ప్రభుత్వం సాయం ఇస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి ప్రతిపక్షాలు వీటిని ఆపివేసిందని సీఎంవో బ్లూమీడియాకు నోట్ పంపించినట్లు సమాచారం.

AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

Updated Date - May 06 , 2024 | 08:12 PM