Share News

Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్..

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:57 PM

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు.

Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్..

అమరావతి: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు.

మాకు సంబంధం లేదు.. మేము పట్టించుకోం..: మోదీ వ్యాఖ్యలపై మాథ్యూ మిల్లర్


అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చాలా కీలకమని.. ప్రతిఒక్కరూ క్షేత్ర స్థాయిలో పర్యటనలు, ప్రచారం చేయాలన్నారు. ఈ ఐదేళ్లల్లో జరిగిన దాడులు, దారుణాలు ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కల్యాణ్ మనపై నమ్మకంతో అవకాశం కల్పించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు మనమేం చేస్తామో, ఏమి చేయగలమో వివరించాలన్నారు. బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. తప్పకుండా నవ శకానికి నాందీ పలికేలా అందరూ కలిసి పని చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పాలనలో రాష్ట్రాభివృద్ధి గుండు సున్నా..!

మీరు అమాయకులేం కాదు

29 మంది నక్సల్స్‌ మృతి

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 01:57 PM