Home » Andhra Pradesh
AP New DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.
ఏపీలో ఎన్నికల వేళ అందరిదృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కాపు ఉద్యమనాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని.. పిఠాపురంలో పవన్ను ఓడించే బాధ్యతలు అప్పగించారు.
పొలిటిల్ విశ్లేషకులు భావించినట్లుగానే జరిగింది. మొదట పోలీస్ బాస్పై(AP DGP) వేటు పడింది.. ఆ తరువాత జిల్లా స్థాయి అధికారులపై వేటు పడుతోంది. తాజాగా అనంతపురం(Anantapur) జిల్లా డీఐజీపై(DIG) బదిలీ వేటు పడగా.. ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది. నెక్ట్స్ చర్యలు ఎవరిపైనా? అని ప్రభుత్వ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.
Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్ను స్మశానానికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గూ బాయ్కు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగోలేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వారం రోజులు ముందు కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం కింద ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీతో సహా విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అధికారుల పనితీరుతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.